Sai Pallavi : తెలుగు తెరపై తన అద్భుతమైన నటన, డ్యాన్స్తో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఈమె గ్లామర్ షో చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఈమె తన నటన, డ్యాన్స్నే నమ్ముకుని కెరీర్లో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో మైత్రి అనే యువతి పాత్రలో సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. దీంతో సాయిపల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే ఈ సినిమాలో సాయిపల్లవి ఏమంత అందంగా లేదని.. కొందరు నెటిజన్లు సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టారు. తమిళంలో ఆ పోస్టు వైరల్ అయింది. దీనికి గాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి తిట్టిన కామెంట్లలో తమిళిసై పేరును కూడా చేర్చారు. సాయిపల్లవి అందంగా లేదని, తమిళిసై ఈ విషయంలో ప్రశాంతంగా ఉండలేరని.. అర్థం వచ్చేలా కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తూ తిట్టారు. దీంతో గవర్నర్ తమిళిసై స్పందించారు.
తనపై, సాయపల్లవిపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. ఓ తమిళ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టడం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. గతంలో తనను కూడా ఇలాగే బాడీ షేమింగ్ చేసేవారని, తన రూపంపై ఇష్టం వచ్చినట్లు తిడుతూ మాట్లాడేవారని, ట్రోల్ చేసేవారని తమిళిసై బాధపడ్డారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధ తెలుస్తుందని, అయినప్పటికీ తన ప్రతిభతో పైకి వచ్చానని, అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని అన్నారు.
అలాంటి కామెంట్లు చేసినప్పుడు బాధ అనిపించే మాట వాస్తవమే అయినా.. వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమని తమిళిసై అన్నారు. పొట్టిగా ముదురు రంగు చర్మంతో లేదా నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంటుంది. అందుకే మన సామెత.. కాకి తన పిల్లను బంగారం అనుకుంటుంది.. దాని రంగు ఏదైనప్పటికీ.. నల్లగా ఉన్నందున తిరస్కరించదు.. అని తమిళిసై అన్నారు.
పురుషులు సాధారణంగా ఎలా ఉన్నా తమ రూపం పట్ల అంతగా విమర్శలను ఎదుర్కోరు. కానీ మహిళలు అందంగా లేకపోతే ఎల్లప్పుడూ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు కూడా యువకులుగా చెలామణీ అవుతుంటారు. కానీ మహిళలు యుక్త వయస్సులో ఉన్నా ఇలాంటి కామెంట్లను అనుభవించాల్సి వస్తుందని.. తమిళిసై అన్నారు.
గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పిక్సల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెనకడుగు వేసిన వారికి శుభవార్త. పిక్సల్ 10…
టీ20 వరల్డ్కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల…
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…