Sai Pallavi : తెలుగు తెరపై తన అద్భుతమైన నటన, డ్యాన్స్తో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి ముందు వరుసలో నిలుస్తుందని చెప్పవచ్చు. ఈమె గ్లామర్ షో చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ ఈమె తన నటన, డ్యాన్స్నే నమ్ముకుని కెరీర్లో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో మైత్రి అనే యువతి పాత్రలో సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. దీంతో సాయిపల్లవి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే ఈ సినిమాలో సాయిపల్లవి ఏమంత అందంగా లేదని.. కొందరు నెటిజన్లు సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టారు. తమిళంలో ఆ పోస్టు వైరల్ అయింది. దీనికి గాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సాయిపల్లవిని ఉద్దేశించి తిట్టిన కామెంట్లలో తమిళిసై పేరును కూడా చేర్చారు. సాయిపల్లవి అందంగా లేదని, తమిళిసై ఈ విషయంలో ప్రశాంతంగా ఉండలేరని.. అర్థం వచ్చేలా కొందరు నెటిజన్లు ఎగతాళి చేస్తూ తిట్టారు. దీంతో గవర్నర్ తమిళిసై స్పందించారు.
తనపై, సాయపల్లవిపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. ఓ తమిళ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయిపల్లవిని బాడీ షేమింగ్ చేస్తూ తిట్టడం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. గతంలో తనను కూడా ఇలాగే బాడీ షేమింగ్ చేసేవారని, తన రూపంపై ఇష్టం వచ్చినట్లు తిడుతూ మాట్లాడేవారని, ట్రోల్ చేసేవారని తమిళిసై బాధపడ్డారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధ తెలుస్తుందని, అయినప్పటికీ తన ప్రతిభతో పైకి వచ్చానని, అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని అన్నారు.
అలాంటి కామెంట్లు చేసినప్పుడు బాధ అనిపించే మాట వాస్తవమే అయినా.. వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమని తమిళిసై అన్నారు. పొట్టిగా ముదురు రంగు చర్మంతో లేదా నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంటుంది. అందుకే మన సామెత.. కాకి తన పిల్లను బంగారం అనుకుంటుంది.. దాని రంగు ఏదైనప్పటికీ.. నల్లగా ఉన్నందున తిరస్కరించదు.. అని తమిళిసై అన్నారు.
పురుషులు సాధారణంగా ఎలా ఉన్నా తమ రూపం పట్ల అంతగా విమర్శలను ఎదుర్కోరు. కానీ మహిళలు అందంగా లేకపోతే ఎల్లప్పుడూ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 50 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు కూడా యువకులుగా చెలామణీ అవుతుంటారు. కానీ మహిళలు యుక్త వయస్సులో ఉన్నా ఇలాంటి కామెంట్లను అనుభవించాల్సి వస్తుందని.. తమిళిసై అన్నారు.
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…