Tamannaah : చిత్ర పరిశ్రమకు తమన్నా వచ్చి దాదాపుగా 15 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్లకు కొదువ ఉండడం లేదు. ఎప్పటికప్పుడు అన్ని భాషలకు చెందిన సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని భాషలకు చెందిన చిత్ర పరిశ్రమల్లోనూ తమన్నా తన జోరు కొనసాగిస్తోంది. అయితే తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కాస్త బరువు పెరిగింది. దీంతో ట్రోలర్స్ ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే వాస్తవానికి తమన్నా ఎల్లప్పుడూ ఫిట్గానే ఉంటుంది. వర్కవుట్స్ చేస్తుంటుంది. కానీ ట్రోలర్స్ వల్లనో ఏమో తెలియదు కానీ.. ఈమధ్య వర్కవుట్స్ బాగా చేస్తోంది.
ఇక లేటెస్ట్గా ఆమె మరోమారు ఫిట్నెస్ సెషన్లో పాల్గొంది. అందులో ఆమె కఠినమైన వ్యాయామాలను చేసింది. తన ట్రెయినర్ సహాయంతో ఆమె కసరత్తులు చేసింది. అదే సమయంలో తన వర్కవుట్స్ను వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఇక ఆ వీడియోతోపాటు తమన్నా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఎల్లప్పుడూ ఫిట్గా ఉండాలని.. అలా ఉండకపోయినా.. ఫిట్నెస్ సాధించకపోయినా కష్టమని.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని ఆమె కామెంట్స్ చేసింది. ఇక ఆమె వీడియో వైరల్ అవుతోంది.
కాగా తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె వెంకటేష్కు జోడీగా నటించిన ఎఫ్3 మూవీ త్వరలో విడుదల కానుంది. అలాగే చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తోంది. దీంతోపాటు బోలే చుడియన్, ప్లాన్ ఎ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్ అనే 3 హిందీ సినిమాల్లోనూ ఈమె నటిస్తూ బిజీగా ఉంది.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…