Tabu : కూలీ నంబర్ వన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. టబు. ఈమె తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి చక్కని నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. కొందరు విదేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ టబు మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఈమె ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో కారణం చెప్పేసింది. ఓ హీరో వల్లే తాను పెళ్లి చేసుకోలేకపోయానని వివరించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ? అంటే..
అప్పట్లో టబు నాగార్జునతో నిన్నే పెళ్లాడతా అనే మూవీ చేసింది. అందులో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు బాగానే ఉన్నాయి. వీరిద్ధరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. దీంతో నాగ్, టబుల మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక హిందీతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు టబు అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చేది. దీంతో ఆమె నాగార్జున ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలోనే వీరిమధ్య ఏదో నడుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదేదీ నిజం కాదని టబు కొట్టి పారేసింది.
ఇక అప్పట్లో అజయ్ దేవగన్ తాను ఎక్కడకు వెళ్లినా తనను ఫాలో అవుతుండే వాడని, తనను ఏ యువకుడు చూసినా వారికి వెళ్లి వార్నింగ్ లు ఇచ్చేవాడని తెలియజేసింది. ఈ క్రమంలోనే అజయ్ దేవ్ గన్ వల్లనే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పి షాకిచ్చింది. అంతే కాకుండా తాను చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటానని.. ఈ క్రమంలోనే అజయ్ దేవ్ గన్ కూడా తనను అలాగే చూసుకునేవాడని టబు చెప్పింది. అయితే మరి అంతలా కలసి మెలసి ఉన్న ఇద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అజయ్ దేవ్ గన్ కాజోల్ను ఎందుకు వివాహమాడాడు ? అన్న వివరాలపై మాత్రం టబు స్పష్టతను ఇవ్వలేదు. బహుశా ఇద్దరికీ బ్రేకప్ అయి ఉంటుందని.. కనుకనే ఆ డిప్రెషన్లో టబు ఇక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని సమాచారం. ఏది ఏమైనా.. టబు గురించి టాపిక్స్ అప్పుడప్పుడు ఇలా వైరల్ అవుతుంటాయి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…