Sukumar : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీ మార్కెట్లోనూ పుష్ప ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే పుష్ప మూవీ వచ్చి చాలా రోజులు అవుతున్నా.. ఈ మూవీ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీలోని డైలాగ్లను చెబుతూ.. పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. సెలబ్రిటీలు సైతం పుష్ప డైలాగ్స్, పాటలకు ఫిదా అవుతున్నారు. అయితే పుష్ప 2వ పార్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇంకా అది జరగలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీ విడుదల లేనట్లే అని చెప్పవచ్చు. అయితే దర్శకుడు సుకుమార్పై మాత్రం బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో ఉన్నారు.
దర్శకుడు సుకుమార్ గతంలో ఇతర సినిమాలకు చెందిన ఈవెంట్లకు పెద్దగా హాజరు కాలేదు. కానీ ఈ మధ్య తరచూ ఇతర హీరోలకు చెందిన ఈవెంట్లలో పాల్గొంటున్నారు. సర్కారు వారి పాట, విరాట పర్వం ఇలా పిలిచిన ప్రతి ఈవెంట్కు వెళ్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పుష్ప 2 షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇంకా ఎందుకు ప్రారంభించలేదని.. దర్శకుడు సుకుమార్ ఈ మూవీని లైట్ తీసుకుంటున్నాడని.. త్వరగా పనులు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాలని.. ఇంత నిర్లక్ష్యం పనికిరాదని అంటున్నారు. అయితే సుకుమార్ మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు.
ఇక పుష్ప 2 ఆలస్యం అవుతుండడానికి సుకుమార్ కారణం కాదని.. అల్లు అర్జున్ రెమ్యునరేషనేనని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి పార్ట్కు బన్నీ రూ.45 కోట్లు తీసుకున్నాడట. కానీ రెండో పార్ట్కు రెమ్యునరేషన్గా హిందీ హక్కులను అడుగుతున్నారట. అందువల్లే సినిమా నిర్మాతలు బన్నీతో చర్చిస్తున్నారట. కనుకనే పుష్ప 2 ఆలస్యం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఏది ఏమైనా.. పుష్ప 2 మూవీ మాత్రం ఈ ఏడాదిలో విడుదల కాదని సులభంగా చెప్పవచ్చు. ఇప్పటికప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా కనీసం ఏడాది పడుతుంది. అంటే.. వచ్చే ఏడాది వేసవిలోనే పుష్ప 2 వస్తుందని భావించవచ్చు. మరి అప్పటి వరకు అయినా మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…