Sushanth : సోషల్ మీడియా లేని రోజుల్లో హీరోలు, హీరోయిన్లు ఏదైనా పత్రికకో లేదా చానల్కో ఇచ్చే ఇంటర్వ్యూలనే ఎక్కువగా ప్రేక్షకులు చూసే వాళ్లు. ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు వారు చెప్పే సమాధానాలు తెలుసుకుని అక్కడి వరకే ప్రేక్షకులు సంతృప్తి పడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక.. అలాంటి ఇంటర్వ్యూలతో పనిలేకుండా పోయింది. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్లను ఫ్యాన్సే నేరుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే నెటిజన్లు సరిగ్గా ప్రశ్నలు అడిగి అందుకు సెలబ్రిటీలు సరిగ్గా జవాబులు చెబితే ఓకే. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో నెటిజన్లు వింతైన ప్రశ్నలు అడుగుతుంటారు. దీంతో అలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా నటుడు సుశాంత్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ నెటిజన్ సుశాంత్ను చాలా దారుణంగా ఓ మాట అడిగేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నటుడు సుశాంత్ ఇటీవల తన సోషల్ ఖాతాలో లైవ్ నిర్వహించాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అయితే ఓ నెటిజన్ మాత్రం నువ్వు ఇంకా వర్జిన్వేనా.. అని సుశాంత్ను అడిగేశాడు. అయితే దీనికి సుశాంత్ తడుముకోకుండా.. నిప్పు సింబల్ను చూపించాడు. అంటే.. తాను ఇంకా నిప్పునేనని, తన శీలం పదిలంగానే ఉందని ఆయన అలా సింబాలిక్గా చెప్పారన్నమాట. అంటే ఆయన ఇంకా వర్జినే అన్న విషయం స్పష్టమైంది.
ఇక ఇంకో నెటిజన్ మీ పెళ్లి తేదీ ఎప్పుడు అని అడగ్గా.. ఇంకా అమ్మాయినే వెతుక్కోలేదు. అప్పుడే పెళ్లి తేదీ ఎలా చెప్పగలను.. అంటూ సుశాంత్ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన రిప్లైస్ అదిరిపోయేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మళ్లీ బన్నీతో ఎప్పుడు కలసి నటిస్తారు.. అని అడగ్గా.. చాన్స్ వస్తే అల వైకుంఠపురములో సెకండ్ పార్ట్లో నటిస్తానని.. అయితే దీనిపై బన్నీని కూడా అడగాలని సుశాంత్ చెప్పారు. సుశాంత్ అల వైకుంఠ పురములో సినిమాలో ఓ కీలకపాత్రలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే సుశాంత్ నేరుగా చేస్తున్న చిత్రాలు ఏవీ హిట్ కావడం లేదు. దీంతో ఆయన ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…