Star Actress : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు.
2011 సంవత్సరంలో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించి సక్సెస్ ను అందుకుంది. ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు అందరి తో జత కట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో ఓబులమ్మ అనే డీగ్లామరస్ రోల్ లో నటించింది రకుల్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది. కొండపొలం చిత్రం తర్వాత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించడం లేదు. తెలుగు చిత్రలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ చిత్రాలకు దగ్గర అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో థాంక్యూ గాడ్ చిత్రంలో కూడా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 మరియు లేడీస్ నైట్ అనే చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…