Faria Abdullah : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ సక్సెస్ను అందుకున్న చిత్రంగా.. జాతిరత్నం మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో చిట్టిగా నటించిన ఫరియా అబ్దుల్లా యువతను ఎంతో ఆకట్టుకుంది. ఈమె ఈ చిత్రంతో అనేక ఆఫర్లను పొందుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆశించినట్లు ఆఫర్లు మాత్రం ఏమీ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో చిన్న అతిథి పాత్రలో ఈమె నటించింది. తరువాత నాగార్జున, నాగచైతన్యలతో కలిసి బంగార్రాజు మూవీలో డ్యాన్స్ చేసింది. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లోనూ నటిస్తోంది.
ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రావణాసుర అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా ఈమెకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీన్ని చూసిన వారందరూ.. వామ్మో.. ఏంటి.. ఈమె ఎలా డ్యాన్స్ చేసింది.. ఈమె ఇలా కూడా చేస్తుందా.. అని షాకవుతున్నారు. అందులో ఈమె బెల్లీ డ్యాన్స్ చేయడం విశేషం. ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లకు మతులు పోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె డ్యాన్స్కు ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు. కొందరు బాగా చేశావని కామెంట్స్ పెడుతుంటే.. కొందరు గుండెల్లో మంట పెట్టేశావు.. అని అంటున్నారు.
ఇక ఫరియా అబ్దుల్లా చేసిన ఈ డ్యాన్స్కు యువత మైమరిచిపోతున్నారు. గతంలో ఈమె ఎప్పుడూ ఇలా కనిపించలేదు. దీంతో ఈమె ఇలా డ్యాన్స్ చేసే సరికి ఈమె ఈ డ్యాన్స్ కూడా చేయగలదా.. అని షాకవుతున్నారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేయడం ద్వారా తాను దర్శక నిర్మాతలకు మెసేజ్ పంపిందని అంటున్నారు. ఇలాగైనా చాన్స్లు ఇస్తారేమోనని ఆమె ఆశ పడిందని అంటున్నారు. మరి ఆమెకు ఫ్యూచర్లో అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…