Kamala Pandu : ఆరెంజ్ ఫ్లేవర్ అందరికి ఇట్టే నచ్చేస్తుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచితో ఎవరినైనా ఈ కమలా పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫాస్పరస్, బీటా కెరోటిన్ వంటివి శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. శరీర పెరుగుదలకి, జీవక్రియలు సక్రమంగా పని చేయడంతోపాటు రక్తపోటును తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమలా పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి వేరే చెప్పనక్కరలేదు.
100 గ్రాముల కమలాపండు తీసుకుంటే దీనిలో మనకు 30 మిల్లి గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అనేది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి తో పాటు కమలా పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన కిడ్నీలో స్టోన్స్ ను కరిగించడానికి సహకరిస్తుంది. ఐరన్ అనేది మన శరీరానికి అందాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. ఎప్పుడయితే మన శరీరంలో ఐరన్ పెరుగుతుందో రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. కమలాలలో తక్కువ కార్బోహైడ్రేట్లు తక్కువ శక్తి ఉండటం వల్ల త్వరగా అరుగుదల అనేది వస్తుంది.
మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారు కమలా పండ్లను తినడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కమలా పండ్లలో లిగ్నిన్, పెక్టీన్ అనే ఫైబర్ ఉండటం వల్ల పేగుల కదలికలు బాగా జరిగి మలబద్దకం అనేది తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా కమలాలలో నేచురల్స్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి డయాబెటిస్ పేషెంట్ కూడా చక్కెర స్థాయిలు పెరుగుతాయని భయం లేకుండా కమలాలను నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.
ముఖ్యంగా కమలాలలో హెస్పిరిడిన్, యాంథోసైనోనిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వలన రక్తంలోకి చక్కెరను చేరకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు పడుకునే ముందు ఒక కమలాపండు తినడం వలన ట్రిప్టోఫాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి హాయిగా నిద్ర పట్టడానికి సహకరిస్తుంది. అందువల్ల ఈ పండ్లను రోజూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…