Sri Reddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది కనుక అందులో యాక్టివ్గా ఉండే అందరికీ ఈమె గురించి కచ్చితంగా తెలుస్తుంది. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈమె నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఏదో ఒక సామాజిక అంశంపై ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. కనుకనే ఆమె ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తన యూట్యూబ్ చానల్ను పాపులర్ చేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే అందులో పలు వంటల వీడియోలను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈమె రూటు మార్చింది. ఈమధ్య రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ తింటూ ఆ రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా ఈమె రెండు రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి ఫుడ్స్ను రుచి చూసి రివ్యూలను ఇచ్చేసింది.
ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. యూట్యూబ్ చానల్లో వంటల వీడియోల ద్వారా ఈమె పిచ్చెక్కిస్తోంది. చికెన్, మటన్, పీతలు, చేపలు వంటి వివిధ రకాల నాన్వెజ్ ఐటమ్స్ను వండిన ఈమె ఆ వీడియోలను పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. అయితే శ్రీరెడ్డి ఇప్పుడు వంటలు కాదు కానీ బంగారం కొనడంలో బిజీ అయింది. ఆమె ఓ నగల షాపుకు వెళ్లినట్లు తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోలో చెప్పింది. అయితే నగల షాపుకు వెళ్లిన తరువాత తనతో బంగారం అంతా కొనిపించేశారని థంబ్ నెయిల్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని రేకెత్తించిన విషయం విదితమే. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. దీంతో దెబ్బకు సినీ పెద్దలు దిగి వచ్చి ఆమెకు మా మెంబర్షిప్ ఇస్తామని చెప్పారు. అయితే ఆర్జీవీ సూచన మేరకు ఆమె పవన్ను దూషించింది. దీంతో పవన్ అభిమానులు ఆమెపై కనిపిస్తే దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే ఇదే విషయమో.. మరొకటో తెలియదు కానీ.. ఈమె ప్రస్తుతం హైదరాబాద్ను వదిలి చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోలను చేసుకుని జీవనం సాగిస్తోంది.
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్ను అందుబాటులోకి…