Sri Reddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది కనుక అందులో యాక్టివ్గా ఉండే అందరికీ ఈమె గురించి కచ్చితంగా తెలుస్తుంది. ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈమె నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. ఏదో ఒక సామాజిక అంశంపై ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. కనుకనే ఆమె ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తన యూట్యూబ్ చానల్ను పాపులర్ చేయడంలో బిజీగా మారింది. ఇప్పటికే అందులో పలు వంటల వీడియోలను ఆమె పోస్ట్ చేసింది. అయితే ఈమె రూటు మార్చింది. ఈమధ్య రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ తింటూ ఆ రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా ఈమె రెండు రెస్టారెంట్లకు వెళ్లి అక్కడి ఫుడ్స్ను రుచి చూసి రివ్యూలను ఇచ్చేసింది.
ఇక శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. యూట్యూబ్ చానల్లో వంటల వీడియోల ద్వారా ఈమె పిచ్చెక్కిస్తోంది. చికెన్, మటన్, పీతలు, చేపలు వంటి వివిధ రకాల నాన్వెజ్ ఐటమ్స్ను వండిన ఈమె ఆ వీడియోలను పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. అయితే శ్రీరెడ్డి ఇప్పుడు వంటలు కాదు కానీ బంగారం కొనడంలో బిజీ అయింది. ఆమె ఓ నగల షాపుకు వెళ్లినట్లు తాజాగా అప్ లోడ్ చేసిన వీడియోలో చెప్పింది. అయితే నగల షాపుకు వెళ్లిన తరువాత తనతో బంగారం అంతా కొనిపించేశారని థంబ్ నెయిల్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని రేకెత్తించిన విషయం విదితమే. ఈమె ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి జాతీయ వార్తల్లోకి ఎక్కింది. దీంతో దెబ్బకు సినీ పెద్దలు దిగి వచ్చి ఆమెకు మా మెంబర్షిప్ ఇస్తామని చెప్పారు. అయితే ఆర్జీవీ సూచన మేరకు ఆమె పవన్ను దూషించింది. దీంతో పవన్ అభిమానులు ఆమెపై కనిపిస్తే దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే ఇదే విషయమో.. మరొకటో తెలియదు కానీ.. ఈమె ప్రస్తుతం హైదరాబాద్ను వదిలి చెన్నైలో ఉంటూ యూట్యూబ్ వీడియోలను చేసుకుని జీవనం సాగిస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…