OTT : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాకు ఎంత పవర్ ఉందో మనందరికీ తెలుసు. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించాలే కానీ.. ప్రభుత్వాలే దిగి వస్తాయి. ఇలాంటి సంఘటనలను మనం గతంలో చూశాం. ఇక ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు ఓటీటీలు అబ్బా.. అంటున్నాయి. అవును.. నిజంగా ఇది నెటిజన్లు సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు. అసలే థియేటర్లలో టిక్కెట్ల రేట్లు పెరిగి అక్కడకు వెళ్లలేక ఓటీటీల్లో చూసేందుకు ఆసక్తిని చూపిస్తుంటే.. ఇక్కడ కూడా ఓవైపు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా.. ఠాఠ్.. పే పర్ వ్యూ లెక్కన రూ.199 చెల్లించి మరీ సినిమా చూడాల్సిందే.. అంటే.. ఎలా.. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఈ క్రమంలోనే ఈ సెగ జీ5 కు బాగానే తగిలినట్లు ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీని చూసేందుకు ఎలాంటి రుసుము అవసరం లేదని తెలియజేసింది. దీంతో ప్రేక్షకులకు భారీ ఊరట లభించింది.
ఆర్ఆర్ఆర్ మూవీ జీ5లో ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమ్ కానున్న విషయం విదితమే. అయితే దీన్ని చూడాలంటే.. సబ్స్క్రిప్షన్ ఉన్నా సరే.. రూ.199 చెల్లించి పే పర్ వ్యూ పద్ధతిలో ఈ మూవీని చూడాలని జీ5 కండిషన్ పెట్టింది. దీంతో అటు అమెజాన్ ప్రైమ్ కూడా కేజీఎఫ్ 2కు ఇలాంటి దిక్కుమాలిన కండిషన్ నే పెట్టింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రేక్షకులు ఈ రెండు ఓటీటీ యాప్లను భారీగా ట్రోల్ చేస్తూ విమర్శించారు. ఓవైపు ఏడాదికో.. ఆరు నెలలకో లేదా నెలకో అని చెప్పి అధికంగా ఖర్చు చేసి ఆయా ఓటీటీ యాప్లలో సబ్స్క్రిప్షన్లను తీసుకున్నాం కదా.. మళ్లీ సినిమాలను చూసేందుకు డబ్బులు కట్టమంటారేంటి ? అని సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఆయా ఓటీటీ యాప్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు కొన్ని సైట్లలో ఇప్పటికే ఆ మూవీలకు చెందిన హెచ్డీ ప్రింట్లను కూడా వదిలారు. దీంతో మొదటికే మోసం వస్తుందని.. జనాలు అందరూ పైరసీ చూసేలా ఉన్నారని భావించిన జీ5 తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆర్ఆర్ఆర్ను ఉచితంగానే చూడవచ్చని.. అయితే తమ యాప్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ మూవీని ఉచితంగా చూడగలరని తెలియజేసింది. దీంతో ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కచ్చితంగా ఇది సోషల్ మీడియా సాధించిన ఘన విజయం అనే చెప్పవచ్చు.
ఇక మే 20వ తేదీన ఆర్ఆర్ఆర్తోపాటు పలు ఇతర సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. కేజీఎఫ్ 2, ఆచార్య, భళా తందనాన వంటి మూవీలను శుక్రవారం నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఇక మోహన్ లాల్ నటించిన ట్వెల్త్ మ్యాన్ అనే మూవీ నేరుగా ఓటీటీలోనే 20వ తేదీన రిలీజ్ అవుతోంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో వీక్షించవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…