Sneha : ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది స్నేహ. గ్లామర్ షో కోసం హద్దులు దాటకుండా.. సంప్రదాయంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
తమిళంలో అచ్చాముందు అచ్చాముందు సినిమా షూటింగ్ సమయంలో కోలీవుడ్ హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. 2012లో వివాహం చేసుకుంది స్నేహ. పెళ్లి తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. తాజాగా స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వడ్డీ చెల్లించమని అడిగినందుకు ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపింది.
చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్ కోసం అప్పుగా 26 లక్షల రూపాయలు తీసుకొని, తనను మోసం చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు స్నేహ ఫిర్యాదు చేసింది.
అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. స్నేహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…