నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు చెప్పిన తరువాత నుంచి సమంత దూకుడు పెంచింది. ఎడా పెడా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే పుష్ప మూవీలో ఊ అంటావా మావా.. పేరిట ఐటమ్ సాంగ్ చేసి తాను ఐటమ్ సాంగ్లకు కూడా రెడీ అనే సంకేతాలను దర్శక నిర్మాతలకు పంపింది. ఇక ముంబైలోనూ మకాంను ఏర్పాటు చేసుకున్న సమంత పలు బాలీవుడ్ మూవీలు, సిరీస్లలోనూ నటించేందుకు రెడీ అవుతోంది. అయితే విడాకుల అనంతరం సమంత ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.
అక్కినేని వారి కోడలిగా ఉన్నన్ని రోజులు సమంత కాస్త పద్ధతిగా అయినా ఉండేది. కానీ విడాకుల ప్రకటన అనంతరం మరీ గ్లామర్ డోసును పెంచింది. ఆకాశమే హద్దుగా అందాల ఆరబోత చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ మధ్యే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని వివాదాస్పద కామెంట్లు చేసింది. దీంతో చైతూ ఫ్యాన్స్ ఆమెపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఓ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సమంత గత కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. నీ మీద నెగెటివ్ టాక్ బాగా ఉంది. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండమని ఓ దర్శకుడు ఆమెకు చెప్పాడట. అందుకనే సమంత ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో పోస్ట్లు పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. విషయం వేరే ఉందని తెలుస్తోంది. సమంత సర్జరీ చేయించుకుని గర్భసంచి తొలగించుకుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి సమంతకు తల్లి కావాలని కోరిక బాగా ఉండేదట. కానీ నాగచైతన్యకు ఎప్పుడైతే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిందో తరువాత రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఖరాఖండిగా ఇంట్లో కూడా చెప్పేసిందట. కానీ తల్లిదండ్రులు మాత్రం ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆమెను ఫోర్స్ చేస్తున్నారట. అయితే ఇదంతా ఎందుకనుకున్న సమంత గర్భసంచిని తీయించుకుందట. దీంతో ఆమె తల్లి కావాలనుకునే తన కలను తానే దూరం చేసుకున్నట్లు అయింది. అయితే ఈ కారణంగానే ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉందని.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుందని.. త్వరలోనే మళ్లీ యాక్టివ్ అవుతుందని తెలుస్తోంది.
అయితే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…