Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న తమ విడాకుల విషయం ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. వీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ ఇష్టపడి పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ 2021 మే నెల నుంచి వారిద్దరూ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దాదాపు మూడు, నాలుగు నెలల ప్రచారం అనంతరం నాగచైతన్య, తాను అధికారికంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము.. అంటూ సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్దరూ ఉన్నట్లుండి విడిపోతున్నామంటూ ప్రకటించడంపై ఫ్యాన్స్ సహా సినీ లోకం ఆశ్చర్యపోయింది. అయితే వారిద్దరూ ఎందుకు విడిపోతున్నారో ఎక్కడా బయటకు చెప్పలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరూ వారి వారి లైఫ్లను లీడ్ చేస్తున్నారు. ఎక్కడా ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేసిందే తప్ప ఎక్కడ కూడా చైతూ గురించి మాట్లాడింది లేదు. కానీ తాజాగా తన ఇన్స్టా పోస్ట్లో మజిలీ పోస్టర్ షేర్ చేస్తూ.. మజిలీకి 3 ఏళ్లు అంటూ తెలిపింది.
పోస్టర్లో చైతూ సీరియస్ లుక్లో కనిపిస్తుండగా.. పైన కనిపిస్తున్న వాటిలో ఇద్దరూ చాలా ఆప్యాయంగా కనిపిస్తున్నారు. ఆటోనగర్ సూర్య, మనం తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. అనుకోని పరిస్థితుల కారణంగా విడిపోయిన ఓ జంట చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చైతూ తన బెస్ట్ పెయిర్ సమంత అని చెప్పిన విషయం తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…