Samantha : టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె ప్రస్తుతం విజయ్ దేవర కొండతో కలిసి ఖుషి అనే మూవీలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ను ఇటీవలే కాశ్మీర్ లో పూర్తి చేశారు. దీంతోపాటు యశోద అనే సినిమాలోనూ సమంత నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి కాగా ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా గురించే ఎలాంటి అప్డేట్ రావడం లేదు.
శాకుంతలం సినిమా పౌరాణిక గాథ ఆధారంగా తెరకెక్కింది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సమంత ఈ మూవీకి గాను షూటింగ్, డబ్బింగ్ను కూడా పూర్తి చేసుకుంది. కానీ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మొన్నా మధ్య సమంత బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. అయితే అది అంతా నాసిరకంగా ఉందని కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ అసలు బాగాలేవని చాలా మంది పెదవి విరిచారు. అయితే ఆ తరువాత శాకుంతలం సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అసలు ఈ సినిమాకు ఏమైంది.. అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం శాకుంతలం సినిమాకు గాను గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. కానీ ఈ సినిమాలో సమంత లుక్ బాగా లేదని సహ నిర్మాత దిల్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేశారట. అలాగే గ్రాఫిక్స్ కూడా అంత బాగా రాలేదని అంటున్నారు. ఇదే విషయంపై సమంత కూడా అసంతృప్తిగానే ఉందట. దీంతో ఈ సినిమా అసలు విడుదలవుతుందా.. కాదా.. అయితే ఎప్పుడు అవుతుంది.. అన్న వివరాలేవీ తెలియడం లేదు. అయితే సినిమాను మళ్లీ తీయడం కుదరదు. కనుక ఎలా వచ్చినా సరే దాన్ని విడుదల చేయాల్సిందే. అదే జరిగితే సమంత నిండా మోసపోయినట్లేనని అంటున్నారు. ఎందుకంటే నాసిరకంగా సినిమాను రిలీజ్ చేస్తే ముందుగా సమంతనే అంటారు. ఇది ఆమెకు బాగా మైనస్ అవుతుంది. దీని ప్రభావం ఆమె తదుపరి సినిమాలపై పడుతుంది. కాబట్టి శాకుంతలం విషయంలో ఆమెకు బాగానే నష్టం జరగనుందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…