Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిసిస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెరిగి, శారీరక ఒత్తిడికి గురైన సమంతకు ఈ మయోసైటిస్ అనే అరుదైన చికిత్సకు అందుబాటులో లేని వ్యాధి సోకినట్టు సమాచారం. మయోసైటిసిస్ సమస్యతో బాధపడుతున్న సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అయితే సమంత మయోసైటిసిస్ సోకిన వెంటనే అమెరికాలో కొద్ది రోజులు పాటు చికిత్స తీసుకున్నారు. మయోసైటిసిస్ అనే అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్న సమంత హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉంటూ చికిత్స కొనసాగిస్తోంది. ఇండియాలో కూడా ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ఇంగ్లీష్ మందులతో ఈ వ్యాధి నయం కాకపోవడంతో కేరళలో ఆయుర్వేద వైద్యం కూడా ప్రయత్నం చేశారని వార్తలు కూడా వినిపించాయి.
ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న దక్షిణ కొరియాకు తరలించినట్టుగా సమాచారం వినిపిస్తుంది. ఇలా మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందట ఇక అమెరికాలో కూడా ఈ మయోసైటిస్ వ్యాధికి చికిత్స లేకపోవటంతో సమంత దక్షిణ కొరియా వెళ్లిందని సోషల్ మీడియాలలో వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒక్క దక్షిణకొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యంలో కండరాలక్షీణతకు చికిత్స ఉందని తెలియడంతో సమంత అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అయితే సమంత దక్షిణ కొరియా వెళ్లిందన్న వార్తలపై ఆమె కానీ, ఆమె సన్నిహితులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఎటువంటి విషయాన్ని బయటపెట్టలేదు. ఈ వార్తలపై నిజమెంత అనేది సమంత ఇచ్చే సమాచారం పై ఆధారపడి ఉంది.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…