Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది. పన్వేల్లోని ఫామ్హౌస్లో శనివారం రాత్రి సల్మాన్ఖాన్ను పాము కాటేసింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఖాన్పై పెద్దగా ప్రభావం లేదని చెప్పారు. పాము కాటు తర్వాత సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు.
చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఈరోజు ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్హౌస్కి తిరిగి వచ్చారు. సల్మాన్ఖాన్ పరిస్థితిని పర్యవేక్షించడానికి రాత్రంతా డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన ఫామ్హౌస్లో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరై ఈవెంట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సల్మాన్ తో కలిసి మరో వేదికపై కూడా మన హీరోలు హల్చల్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కలసి స్టెప్పులేసి సందడి చేశారు. సల్మాన్ హోస్ట్ చేస్తున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు అలియా, రాజమౌళితో సహా హాజరైన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మోస్ట్ ఫన్నీ హంగామా సృష్టించారు. ఈ స్టేజ్ పైనే ఎన్టీఆర్, చరణ్ సల్మాన్ తో ఆర్ఆర్ఆర్ సినిమాలో మాస్ సాంగ్ హిందీ వెర్షన్ నాచో నాచోకి కలిపి స్టెప్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…