Sai Pallavi : సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు వచ్చిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా తొలి రెండు రోజులు నెగెటివ్ టాక్ను సాధించినా.. క్రమంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మహేష్ హ్యాట్రిక్ విజయాలను సాధించినట్లు అయింది. ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని చూసేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే తాజాగా సాయిపల్లవి కూడా ఈ మూవీని చూసింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి చివరిసారిగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తరువాత ఆమె ఏ ఒక్క కొత్త సినిమాకు కూడా సంతకం చేయలేదు. దీంతో ఆమెకు అసలు ఏమైంది ? సినిమాలు చేయడం మానేస్తుందా ? పెళ్లి చేసుకోబోతుందా ? అని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె స్నేహితులు ఈ వార్తలను ఖండించారు. సరైన కథ లభించడం లేదని.. అలా దొరికితే ఆమె తప్పక సినిమాలు చేస్తుందని చెప్పారు. దీంతో ఆ వార్తలు అబద్ధమని తేలిపోయాయి. ఇక తాజాగా సాయి పల్లవి మరోమారు బయట కనిపించడంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె హైదరాబాద్లోని పీవీఆర్ ఆర్కే కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించింది.
తాజాగా సాయిపల్లవి మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చూసిందని.. అందుకనే ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించిందని తెలుస్తోంది. అయితే ఆమె బయటకు వచ్చిన సమయంలో ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. అయినప్పటికీ ఆమెను సులభంగా గుర్తు పట్టవచ్చు. అయితే ఆమె ఇలా మహేష్ బాబు సినిమా చూడడంతో.. ఇతర తారలకు కూడా ఈ మూవీ ఎంతో నచ్చిందని.. అందుకనే సినిమాను ఆదరిస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. అందులో పూజా హెగ్డెను హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. దీని తరువాత మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్గా ఈ మూవీ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…