Sai Pallavi : సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు వచ్చిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా తొలి రెండు రోజులు నెగెటివ్ టాక్ను సాధించినా.. క్రమంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మహేష్ హ్యాట్రిక్ విజయాలను సాధించినట్లు అయింది. ఈ క్రమంలోనే మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని చూసేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే తాజాగా సాయిపల్లవి కూడా ఈ మూవీని చూసింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి చివరిసారిగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తరువాత ఆమె ఏ ఒక్క కొత్త సినిమాకు కూడా సంతకం చేయలేదు. దీంతో ఆమెకు అసలు ఏమైంది ? సినిమాలు చేయడం మానేస్తుందా ? పెళ్లి చేసుకోబోతుందా ? అని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె స్నేహితులు ఈ వార్తలను ఖండించారు. సరైన కథ లభించడం లేదని.. అలా దొరికితే ఆమె తప్పక సినిమాలు చేస్తుందని చెప్పారు. దీంతో ఆ వార్తలు అబద్ధమని తేలిపోయాయి. ఇక తాజాగా సాయి పల్లవి మరోమారు బయట కనిపించడంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె హైదరాబాద్లోని పీవీఆర్ ఆర్కే కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించింది.
తాజాగా సాయిపల్లవి మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చూసిందని.. అందుకనే ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తూ కనిపించిందని తెలుస్తోంది. అయితే ఆమె బయటకు వచ్చిన సమయంలో ముఖానికి అడ్డుగా స్కార్ఫ్ కట్టుకుని ఉంది. అయినప్పటికీ ఆమెను సులభంగా గుర్తు పట్టవచ్చు. అయితే ఆమె ఇలా మహేష్ బాబు సినిమా చూడడంతో.. ఇతర తారలకు కూడా ఈ మూవీ ఎంతో నచ్చిందని.. అందుకనే సినిమాను ఆదరిస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. అందులో పూజా హెగ్డెను హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. దీని తరువాత మహేష్ రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తారు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్గా ఈ మూవీ ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…