Renu Desai : దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న విషయం విదితమే. తాజాగా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు మరోమారు కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, త్రిష వంటి నటీనటులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే తాజాగా నటి, దర్శకురాలు రేణు దేశాయ్, ఆమె కుమారుడు అకీరా నందన్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా వెల్లడించారు.
తనకు, తన కుమారుడు అకీరా నందన్కు కోవిడ్ సోకిందని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని, అయినప్పటికీ కరోనా సోకిందన్నారు. కొన్ని రోజుల నుంచి తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే టెస్టులు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.
అయితే ప్రస్తుతం తాము కోలుకుంటున్నామని.. తాను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని.. అయినప్పటికీ తనకు కరోనా సోకిందని, అకీరాకు టీకా వేయిద్దాం అనుకుంటున్నామని.. కానీ ఇంతలోపే కోవిడ్ బారిన పడ్డాడని తెలిపారు. కరోనా మూడో వేవ్ను సీరియస్గా తీసుకోవాలని.. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని రేణు దేశాయ్ సూచించారు.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…