Renu Desai : దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న విషయం విదితమే. తాజాగా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు మరోమారు కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, త్రిష వంటి నటీనటులకు కరోనా సోకింది. ఈ క్రమంలోనే తాజాగా నటి, దర్శకురాలు రేణు దేశాయ్, ఆమె కుమారుడు అకీరా నందన్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా వెల్లడించారు.
తనకు, తన కుమారుడు అకీరా నందన్కు కోవిడ్ సోకిందని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నామని, అయినప్పటికీ కరోనా సోకిందన్నారు. కొన్ని రోజుల నుంచి తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే టెస్టులు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.
అయితే ప్రస్తుతం తాము కోలుకుంటున్నామని.. తాను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నానని.. అయినప్పటికీ తనకు కరోనా సోకిందని, అకీరాకు టీకా వేయిద్దాం అనుకుంటున్నామని.. కానీ ఇంతలోపే కోవిడ్ బారిన పడ్డాడని తెలిపారు. కరోనా మూడో వేవ్ను సీరియస్గా తీసుకోవాలని.. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని రేణు దేశాయ్ సూచించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…