Rashmika Mandanna : దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటి రష్మిక మందన్నకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. రష్మికకు సౌత్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ అమ్మడు తనకు ఎలాంటి సినిమాలో అవకాశం వచ్చినా వదలకుండా చేస్తోంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందంతో ఈమె ఎల్లప్పుడూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇక డ్యాన్స్ పరంగా రష్మిక పేరు పెట్టాల్సిన పనే లేదు. అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. పుష్ప మూవీలో సామి సాంగ్కు ఈమె చేసిన డ్యాన్స్.. అద్భుతమనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ పాటకు చేసిన డ్యాన్స్తో ఎంతో మందిని ఈమె ఆకట్టుకుంది.
కాగా రష్మిక మందన్న తన అందాన్నే కాదు.. శరీరాన్ని కాపాడుకోవడంలోనూ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో ఈమె చాలా శ్రద్ధ వహిస్తుంది. రోజూ జిమ్ చేస్తుంటుంది. షూటింగ్ నుంచి కాస్త విరామం లభిస్తే చాలు.. ఫిట్ నెస్పై దృష్టి పెడుతుంది. ఇక ఆమె తాజాగా తన ఫిట్నెస్ కోచ్ కరణ్ సాహ్నీతో కలిసి పలు ఎక్సర్సైజ్లు చేసింది. కాళ్లు, పొట్టకు సంబంధించిన కోర్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లను ఆమె చేసింది. ఈ క్రమంలోనే ఆమె వర్కవుట్స్కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె హిందీ సినిమాల షూటింగ్లలో పాల్గొంటోంది. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను అనే మూవీలో ఈమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గుడ్ బై అనే మూవీలోనూ రష్మిక నటిస్తోంది. కాగా అల్లు అర్జున్ లీడ్ రోల్లో త్వరలో ప్రారంభం కానున్న పుష్ప 2 షూటింగ్ లోనూ ఈమె త్వరలో పాల్గొననుంది. దీంతోపాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ స్టార్ నటుడు విజయ్ తెలుగు సినిమాలోనూ నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇలా పలు వరుస సినిమాలతో రష్మిక ప్రస్తుతం ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…