Rahul Dravid : రాహుల్ ద్రావిడ్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. రాహుల్ ద్రావిడ్, సచిన్, గంగూలీ.. వీళ్లందరూ సమకాలీకులు. అయినప్పటికీ ఎవరి గొప్పదనం వారిదే. ఎవరి శైలి వారిదే. అయితే సచిన్, గంగూలీ కన్నా ద్రావిడ్ను అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు. అది కూడా ఒక్క విషయంలో. ఆయన ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడంటే.. ఇక ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఎందుకంటే ఒక పట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో అయితే జట్టుకు ఒక గోడలా నిలుస్తాడు. జట్టుకు అడ్డుగోడలా ఉండి ద్రావిడ్ ఎన్నో మ్యాచ్లలో భారత్ను గట్టెక్కించాడు. అందుకనే ఆయనను ది వాల్ అని పిలుస్తారు. అయితే ద్రావిడ్ తన కెరీర్లో ఒకసారి వేరే జట్టుకు ఆడాడు. అది ఎప్పుడు.. ఆ జట్టు ఏది ? అంటే..
రాహుల్ ద్రావిడ్ కేవలం భారత్కే కాక స్కాట్లండ్ జట్టు తరఫున కూడా ఆడాడు. అది 2003వ సంవత్సరంలో అతను ఆ జట్టు తరఫున ఆడాడు. మొత్తం 11 మ్యాచ్లను ఆడిన ద్రావిడ్ 600 పరుగులు చేశాడు. అప్పట్లో భారత్కు జాన్ రైట్ హెడ్ కోచ్గా ఉండేవారు. ఆ సమయంలోనే ద్రావిడ్ స్కాట్లండ్ జట్టుకు ఓవర్సీస్ ప్రొఫెషనల్ ప్లేయర్గా ఆడాడు. ఇందుకు గాను 3 నెలలు సమయం కేటాయించాడు. దీంతో ద్రావిడ్కు 45వేల పౌండ్ల వేతనాన్ని కూడా ఇచ్చారు. ఇక ఆ సమయంలో మొత్తం ఆడిన మ్యాచ్లు అన్నీ వన్డేలే కావడం విశేషం.
ఆ మ్యాచ్లలో ఒక టూర్ గేమ్ పాకిస్థాన్తో ఆడాడు. 11 మ్యాచ్లలో ద్రావిడ్ 66.66 సగటుతో ఏకంగా 600కు పైగా పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 92.73 స్ట్రైక్ రేట్తో ద్రావిడ్ ఆ పరుగులను సాధించాడు. ఇక అదే సీజన్లో ద్రావిడ్ టెస్టుల్లో 95.46 సగటును సాధించగా.. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 270 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో ద్రావిడ్ మొత్తం 22 సెంచరీలను 41.77 సగటుతో సాధించడం విశేషం. అందుకనే ద్రావిడ్ను ది వాల్గా అభివర్ణించారు. ఇక ద్రావిడ్ ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…