Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపించింది రాధేశ్యామ్ టీమ్.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకకు సుమారుగా 40 వేల మంది పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్కు జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టి, అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ హోస్ట్ గా వ్యవహరించారు. అయితే అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కటౌట్పై 40 మంది అభిమానులు ఎక్కారు. నిర్వాహకులు ఎంత కోరినా వారు కిందకు దిగలేదు.
అభిమానుల బరువుకు కటౌట్ కూలి కింద పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన చిత్ర బృందాన్ని కలవరపరుస్తోంది. మరోవైపు ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఫ్యాన్స్ని అదుపు చేయలేక లాఠీ ఛార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగించింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…