Puri Jagannadh : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగానూ నిరాశపరిచింది. లైగర్ సినిమాకు ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. లైగర్.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ డై హార్డ్ ఫ్యాన్స్కే ఏ మాత్రం నచ్చడం లేదు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పూరీకి వరుస ఫ్లాపులే ఉన్నాయి. ఆ సినిమాతో ఫామ్లోకి వచ్చిన పూరీ లైగర్తో దానిని కంటిన్యూ చేస్తాడనే అనుకున్నారు. కానీ రొటీన్ కథతో నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు లైగర్ తర్వాత వెంటనే పూరీ విజయ్తోనే జనగణమన సినిమా స్టార్ట్ చేసేశాడు. నిజానికి ఇది మహేష్బాబు కోసం రాసుకున్న కథ. మహేష్ ఆ స్టోరీని రిజెక్ట్ చేయడంతో విజయ్తో పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాడు. విజయ్ లైగర్ రిజల్ట్ రాకుండానే పూరీతో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. కట్ చేస్తే లైగర్.. విజయ్, పూరీ కెరీర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది.
లైగర్ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు భారీగా నష్టపోవడం ఖాయమనే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ జనగణమన చేయడనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే పూరీకి గట్టి దెబ్బ తగిలినట్టే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయ్.. సమంతతో చేస్తోన్న ఖుషి మూవీని పూర్తి చేస్తూ జనగణమనకు బ్రేక్ ఇచ్చేసినట్టే అంటున్నారు. ఇక విజయ్ జనగణమన ఆపేయడం పూరీకి ఒక షాక్ అయితే.. ఇప్పటికే లైగర్ క్రేజ్ చూసి పూరీ నెక్స్ట్ బ్లాక్బస్టర్ ఇస్తాడని అడ్వాన్స్లు ఇచ్చినోళ్లు కూడా ఇప్పట్లో పూరీతో సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఏదేమైనా టెంపర్కు ముందు వరుస ఫ్లాపులు.. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో పూరీని ఎవ్వరూ పట్టించుకోలేదో ఇప్పుడూ అదే పరిస్థితి వచ్చేలా ఉంది. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…