Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమోగానీ వివాదం మరింత ముదురుతోంది. మరోవైపు మంచు విష్ణు తాజాగా తిరుపతిలో ప్రెస్మీట్ పెట్టి.. తమకు అసలు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మందికి చెందిన రాజీనామాలు అందలేదని స్పష్టం చేశారు. రాజీనామాలు అందితే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే మరోవైపు ప్రకాష్ రాజ్.. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు.
మా ఎన్నికలు జరిగిన ఆ స్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎన్నికల అధికారికి ఇప్పటికే ఆయన సీసీటీవీ ఫుటేజ్ కోసం దరఖాస్తు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేని చెప్పారు. దీంతో ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే ప్రకాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకోవచ్చని మంచు విష్ణు చెప్పాక.. ఆయన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్కు చేరుకోవడం సంచలనంగా మారింది.
స్కూల్లో ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్ను ప్రస్తుతం ప్రకాష్ రాజ్ బయటకు తీసే పనిలో ఉన్నారు. ఆ రోజు గొడవలు, దాడులు జరిగాయని చెబుతుంటే ఎవరూ నమ్మడం లేదని, కనుక సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీసులు సైతం స్కూల్ దగ్గరకు చేరుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…