Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను తన మాయలో పడేస్తున్నాడు. ప్రభాస్ పేరు వింటేనే యూత్ లో ఓ పిచ్చ క్రేజ్ ఉంటుంది. ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఈయన లేటెస్ట్ సినిమా అప్డేట్ కోసం పడిగాపులు కాస్తుంటారు. అంత అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్. బాహుబలి చిత్రంతో టాలీవుడ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా తన ట్రెండ్ ని సెట్ చేశాడు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ పిచ్చిలో పడిపోయారు. బాహుబలి చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్.
సాహో, రాధేశ్యామ్ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, ప్రాజెక్ట్ కె, సోలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ప్రభాస్ బిహేవియర్ జెంటిల్ మెన్ లా ఉంటుందని, సెట్ లో అందరితో ఎంతో కలివిడిగా ఉంటాడని తెగ ముచ్చట పడుతూ ఉంటారు అతనితో పని చేసే ప్రముఖులు. ఇదంతా ఒక విషయం అయితే ఒక్క హీరోయిన్ మాత్రం ఆయన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసింది. ఆమె ఇంకెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే.
ప్రభాస్, పూజ హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో కలిసి నటించారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ టైంలో ప్రభాస్ కి, పూజ హెగ్డే కి అస్సలు పడేది కాదట. ఎంతో పొగరుతో ప్రభాస్ ను అవహేళన చేస్తూ మాట్లాడేదని అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ప్రభాస్ షూటింగ్ టైంలో షార్ట్ కి రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నా, కావాలని సెట్ కి ఆలస్యంగా వచ్చేదట. ఒక్కోసారి పూజా హెగ్డే చూపించే అహంకారానికి ప్రభాస్ ఈ చిత్రం నేను చెయ్యను అనే అంతవరకు వెళ్లేవాడట.
అదే విధంగా రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇద్దరూ ఎడముఖం పెడముఖం వేసుకొని కూర్చోవడం మీడియా కంటికి చిక్కింది. లైఫ్ లో పూజా హెగ్డేతో చిత్రాలలో నటించనని చెప్పేవాడట ప్రభాస్ సన్నిహితులతో. ఆ రేంజ్ లో పూజా హెగ్డే ప్రభాస్ కి చిరాకు తెప్పించింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, పూజా హెగ్డే తన డేట్స్ కోసం వచ్చిన దర్శకనిర్మాతలను కూడా ఎంతో పొగరు చూపిస్తూ కండిషన్స్ పెడుతుందట. ఇలా అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరు. మరి పూజా తన పద్ధతిని మార్చుకుంటుందో.. లేదో.. చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…