Macherla Niyojakavargam : యంగ్ హీరో నితిన్ తప్పకుండా హిట్ కొట్టాల్సిందే.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఈ యంగ్ హీరోకు సాలిడ్ హిట్ పడలేదు. చెక్, రంగ్ దే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యి డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన మ్యాస్ట్రో సినిమా కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజ వర్గం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కింది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో నితిన్ సరసన లేటెస్ట్ సెన్షేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ తన లుక్ మార్చుకుని స్క్రీన్పై సందడి చేసినా.. ఆడియన్స్కు పెద్దగా కనెక్ట్ కాలేదు. ట్రైలర్లో నితిన్ చెప్పిన డైలాగ్స్, కొన్ని సీన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేసినా.. అంచనాలను అందులేకపోయింది. దీంతో మొదటి షో నుంచే ఈ సినిమాపై నెగిటివ్ రిపోర్ట్ రావడంతో డిజాస్టర్ గా నిలిచింది మాచర్ల నియోజక వర్గం.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఇటీవల ఓటీటీలో సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మాచర్ల నియోజకవర్గం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మరి ఈ సినిమా ఓటీటీలోనైనా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…