Poorna : శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ్, రవిబాబు దర్శకత్వంలో అవును చిత్రాలతో సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మరింత గుర్తింపును సంపాదించుకుంది. 2004లో మళయాళంలో మంజు పోలోరు పెంకుట్టి చిత్రంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. లడ్డూ బాబు, నువ్విలా నేనిలా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా పూర్ణ నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై ఢీ షో జడ్జ్గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ పూర్ణ. నటనలోనే కాదు డాన్స్ లో కూడా ఆదరగొట్టేస్తోంది. గతేడాది డిసెంబర్ లో వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అయితే గత కొంతకాలంగా పూర్ణ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్ణ.. ఆసిఫ్ అనే వ్యాపారవేత్త ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పూర్ణ పెళ్లి విషయం బయటకు రావడంతో ఇప్పుడు మరో విషయం వైరల్ గా మారింది. పూర్ణ అప్పట్లో ఓ డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ నడిపింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేశాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే డైరెక్టర్ రవిబాబు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అవును చిత్రం మంచి హిట్ అందుకుంది. అవును చిత్రం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో అవును 2, లడ్డూ బాబు సినిమాలు వచ్చాయి.
ఇద్దరూ వరుసపెట్టి సినిమాలు చేయడంతో, ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు పుట్టుకొచ్చాయి. ఇలాంటి బ్యాడ్ రూమర్స్ రావడంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించడం జరిగింది. ఒక చిత్రం కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్లతో నాకు ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు. నేనే అలాంటి బిహేవియర్ కలవాడిని అయితే వేరే హీరోయిన్స్ నా సినిమాలు చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు. ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత నేను వాళ్లకు ఫోన్ కూడా చేయను. కేవలం పూర్ణ నటన చూసే చిత్రాల్లో అవకాశం ఇచ్చాను అంటూ తమపై ప్రచారమవుతున్న లవ్ ఎఫైర్ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…