Pooja Hegde : పూజా హెగ్డె ఒకప్పుడు టాలీవుడ్లో కుర్రహీరోలతో కలిసి సినిమాలు చేసేది. అరవింద సమేత తర్వాత ఈ అమ్మడి ఫేట్ మారింది. బడా హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో సత్తా చాటుతోన్నప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
అరవింద సమేత.. వీరరాఘవతో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది. ఇటీవలే ఆమె రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది డిజాస్టర్గా మిగలడంతో పూజాకు భారీ షాక్ తగిలింది. అలాగే విజయ్తో కలిసి చేసిన బీస్ట్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.
రెండు ఫ్లాపులు వచ్చినా పూజా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అమ్మడు ఒక సినిమా కోసం దాదాపు రూ.2.75 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు అందుకుంటోంది. ఇక రంగస్థలంలో స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలోనూ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ పాట కోసం పూజ ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఒక్క పాట కోసమే ఇంత పెద్ద మొత్తంలో ఏ నటి అందుకోలేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా.. పాటకు సమంత రూ.1.50 కోట్ల పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె ఆ రికార్డ్ని బద్దలు కొట్టింది. దీంతో పూజా హెగ్డె కొత్త రికార్డును సృష్టించినట్లు అయింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…