Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న పూజా హెగ్డె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటోంది. టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నా కూడా ఐటమ్ సాంగ్లకి సై అంటోంది. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో మాస్ డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 లో స్పెషల్ నంబర్ చేయనుందట. ఇందుకోసం భారీగా డిమాండ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పూజాను సంప్రదించగా.. తాను రూ.1.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫైనల్గా మేకర్స్ తనను రూ.1 కోటికి ఒప్పించినట్టు టాక్. ఇప్పటికే రంగస్థలంలో జిగేలు రాణిగా మెప్పించింది పూజా హెగ్డె.
పూజా.. ప్రభాస్తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవల విడుదలయ్యి తన యాక్టింగ్కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన బీస్ట్ తో పూజా కోలీవుడ్లోకి గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా గ్లామర్కు, డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఒక్క సినిమా చేసేందుకు పూజ రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే బీస్ట్ సినిమా కోసం మాత్రం పూజా భారీగానే వసూలు చేసింది. బీస్ట్ కోసం పూజకు రూ.3.50 కోట్లు దక్కాయి. ఇక విజయ్ కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.70కోట్లు తీసుకున్నాడని సమాచారం.
పూజా హెగ్డె ఒక్క ప్రకటన చేసేందుకు పూజ రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఛార్జ్ చేస్తోంది. తన అందం, నటనతోపాటు.. స్టైలిష్ లుక్తో పూజా ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటుంది. అయితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ గురించి వింటుంటేనే నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతోంది.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ ప్లేస్కు దూసుకుపోతోంది పూజా హెగ్డె. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లోనూ ఈమె చోటు దక్కించుకుంటోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…