IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. సీజన్ మొదలు కాబోతుందంటే చాలు.. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఐపీఎల్ మ్యాచ్లకు గతంలో భారీగా టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చేవి. ఐపీఎల్ సీజన్లో పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలంటే నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయిందనే చెప్పవచ్చు. ఐపీఎల్ను అసలు ప్రేక్షకులు ఆదరించడం లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకు కారణం తాజాగా విడుదలైన రేటింగ్స్ అని చెప్పవచ్చు.
కోవిడ్ ముందు సీజన్లో ఓపెనింగ్ వారంలో ఐపీఎల్కు ఏకంగా 3.85 రేటింగ్స్ వచ్చేవి. తరువాత గత సీజన్లో 3.75 రేటింగ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓపెనింగ్ వారంలో కేవలం 2.52 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. అలాగే గత సీజన్లో ఐపీఎల్ రీచ్ 267.7 మిలియన్లు ఉండేది. ఇప్పుడు అది 229.06 మిలియన్లకు పడిపోయింది. అంటే.. ఈసారి ఐపీఎల్ను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదని.. ఈ రేటింగ్స్ ద్వారా తేలిపోయింది. వీటిని టీవీ రేటింగ్స్ ను ఇచ్చే బార్క్ ఇండియా వెల్లడించింది.
అయితే గత సీజన్లకు ఇప్పటికి చాలా తేడా ఉంది. రెండు కొత్త టీమ్లు కలవడం, మ్యాచ్ల సంఖ్య పెరగడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించేలా ఉంది. అలాగే ఈ సారి టీమ్లలో ప్రేక్షకులకు తెలిసిన ప్లేయర్లు, పాత ముఖాలు లేవు. కొత్త ముఖాలు చాలా వచ్చాయి. అలాగే వీక్షకులు ఇష్టపడేలా మ్యాచ్ల షెడ్యూల్ లేదు. ఇవన్నీ ఈసారి ఐపీఎల్ రేటింగ్స్ తగ్గడానికి గల కారణాలుగా చెబుతున్నారు. దీంతో 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్కు వేలం వేయనున్న బీసీసీఐ ఆందోళన చెందుతోంది. తాము అనుకున్న మొత్తం వస్తుందో.. రాదోనని ఖంగారు పడుతున్నారు.
గతంలో ఐపీఎల్ మ్యాచ్లప్పుడు పెద్ద సినిమాలను విడుదల చేసేవారు కాదు. చేసినా వాటి వసూళ్లపై ఐపీఎల్ ప్రభావం పడేది. అయితే ఈ మధ్య కాలంలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ప్రభావం వాటిపై పడలేదు. అంటే.. ఐపీఎల్కు ఆదరణ ఈసారి అంతగా లేదని.. ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. రేటింగ్స్ కూడా అలాగే వచ్చాయి. మరి రానున్న రోజుల్లో అయినా ఈ సారి సీజన్ ఆసక్తికరంగా మారుతుందా.. రేటింగ్స్ పెరుగుతాయా.. లేదా.. అన్నది చూడాలి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…