Aadi Saikumar : ఆది సాయికుమార్, పాయల్ రాజ్పూత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. కల్యాణ్ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ గోగణ దర్శకత్వంలో తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న ఆది ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ తో బీచ్ లో రొమాన్స్ లో మునిగితేలుతున్నాడు.
చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేయగా, ఈ పోస్టర్లో ఆది, పాయల్ సముద్ర తీరంలో కూర్చొని.. ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్గా కనిపించారు. ‘‘యాక్షన్ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. నాయకానాయికలపై ఓ రొమాంటిక్ గీతం తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పాయల్, ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తీస్ మార్ ఖాన్. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు పాయల్ కూడా మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…