Pawan Kalyan : జనసేన పార్టీతో పవన్ కల్యాణ్ ఓ వైపు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. మరోవైపు సినిమాలకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఆయన జనసేన పార్టీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావించారు. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి ప్రతిపక్షం పాత్రనే పోషిస్తున్నారు. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే సినిమాలను వదిలేద్దామని పవన్ ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఆయన వకీల్ సాబ్ తో సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్కు చెందిన ఓ ఫొటో వైరల్గా మారింది. ఇంతకీ అందులో ప్రత్యేకత ఏముంది ? అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..
పవన్ కల్యాణ్ తాజాగా ఏపీలో కౌలు రైతుల భరోసా యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున సహాయం చేస్తున్నారు. దీనికి గాను ఆయన జనసేన పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో పవన్ చేతులెత్తి నమస్కరించినప్పుడు ఆయన ఫొటోను క్లిక్మనిపించారు. ఇక ఆ ఫొటోను పరిశీలిస్తే.. ఆయన చేతి వేళ్లకు ఉంగరాలు కనిపించాయి. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్గా మారింది.
పవన్ స్వతహాగా చేగువేరా భావాలు కలిగిన వ్యక్తి. అలాంటిది ఆయన ఇలా ఉంగరాలను ధరించి కనిపించడం అంటే.. ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆయన సడెన్గా రూటు ఎందుకు మార్చారు ? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే అలా ఉంగరాలను ధరించాలని ఓ దర్శకుడు చెప్పారట. అందుకనే పవన్ అలా చేస్తున్నారట. దీంతో ఆయన సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి పవన్ కల నెరవేరుతుందా.. లేదా.. అనేది చూడాలి.
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…