Pawan Kalyan : క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం.. హరిహర వీర మల్లు. ఈ మూవీ వాస్తవానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఆలస్యంగా షూటింగ్ మొదలైంది. దీంతో బడ్జెట్ ఇంకా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పవన్ మళ్లీ ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈమధ్యే ఈ మూవీలోంచి కొన్ని యాక్షన్ సన్నివేశాలకు చెందిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ సంబుర పడ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువ రోజుల పాటు నిలవలేదని తెలుస్తోంది. కారణం.. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ మొదలుకాక ముందే సినిమాలో కథకు కొన్ని మార్పులు చేయాలని పవన్ సూచించారట. దర్శకుడు క్రిష్కు పవన్ సూచనలు చేశారట. అయితే క్రిష్ కేవలం కొన్ని కాస్ట్యూమ్ డిజైన్ మార్పులు మాత్రమే చేశారట. పెద్దగా ఏమీ మార్చలేదట. దీంతో పవన్కు క్రిష్ ఇలా చేయడం నచ్చలేదని తెలుస్తోంది. దీంతో తాను చెప్పిన సూచనలు చేసే వరకు సినిమా షూటింగ్కు రావొద్దని పవన్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
అయితే పవన్ చేసిన సూచనల ప్రకారం కథలో మార్పులు చేసేందుకు దర్శకుడు క్రిష్ ఏ కోశానా అంగీకరించడం లేదని తెలుస్తోంది. కథను యథా ప్రకారం సినిమాలా తీయాలని క్రిష్ పట్టుబడుతున్నారట. దీంతో మూవీ షూటింగ్కు బ్రేక్ పడిందని అంటున్నారు. ఇక ఈ పరిస్థితుల వల్ల ఎటొచ్చి నిర్మాతకే మరింత కష్టం పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 ఏళ్ల ఆలస్యంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఖర్చు తడిసి మోపెడైంది. మళ్లీ మూవీ షూటింగ్ వాయిదా పడితే ఇక నిర్మాత ఇంకా నష్టాల్లోకి కూరుకుపోవడం ఖాయం. మరి ఈ విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి. ఏది ఏమైనా ఇది పవన్ ఫ్యాన్స్ చేదు వార్తే అని చెప్పవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…