Bandla Ganesh : వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ మంగళవారం తన బర్త్ డే జరుపుకుంది. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వై.ఎస్.విజయమ్మకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల తన తల్లితో కేక్ కట్ చేయించారు. ముద్దాడి బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ ట్వీట్ చేశారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి సైతం విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో.. జగన్ ను విజయమ్మ ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ట్వీట్ లో.. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్యమాత అయ్యారు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ తన తల్లికి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయకపోవడం విశేషం. ఇక ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ విజయమ్మకు బర్త్ డే విషెస్ తెలియజేసి వార్తలలోకి ఎక్కాడు.
పవన్కి వీర భక్తుడిగా ఉండే బండ్ల.. విజయమ్మకు బర్త్ డే విషెస్ చెప్పడంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాతృ సమానులు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, చల్లగా ఉండాలని, ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని.. ఆయురారోగ్య అభివృద్ధిరస్తు.. అంటూ బండ్లగణేష్ ట్వీట్ చేశాడు. అయితే జగన్ అభిమానులు బండ్ల గణేష్ ట్వీట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుండగా, జనసైనికులు మాత్రం ఏకి పారేస్తున్నారు. పవన్కి భక్తుడిని అని చెబుతూ ఇలాంటివి చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు.
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…