OTT Apps : నాలుగు డబ్బులు వస్తాయంటే సమాజంలో కొందరు ఏం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. కానీ తాజాగా ఓటీటీ యాప్స్ కూడా ఇదే కోవకు చెందుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి.. సిరీస్ లు ఉన్నాయి.. ఫీజు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోండి.. వాటిని చూసి ఎంజాయ్ చేయండి.. అని అదేపనిగా యాడ్స్ ఇస్తుంటారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 పుణ్యమా అని కాసులకు కక్కుర్తి పడి.. ఠాఠ్.. ఈ సినిమాలు చూడాలంటే.. డబ్బులు చెల్లించాల్సిందే.. అంటున్నాయి. మరి ఇదేమిటి ? అంత డబ్బు చెల్లించి నెలకో, 3 నెలలకో, ఏడాదికో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం దేనికి ? అలా తీసుకోవాలని ప్రేక్షకుల వద్ద దేబిరించడం దేనికి ?
ఓ వైపు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే.. తీసుకున్న తరువాత.. సినిమాలను ఇలా వీడియో ఆన్ డిమాండ్ లేదా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయడం దేనికి ? అంత మాత్రానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని చెప్పడం ఎందుకు ? సినిమాలన్నింటినీ అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇది నిజంగానే ఒక రకమైన దోపిడీ అన్న భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది.
అసలే పెరిగిన టిక్కెట్ల ధరలతో థియేటర్లకు వెళ్లలేక ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడితే.. అక్కడ కూడా ఇలా రేట్లు పెట్టి మరీ సినిమాలను చూడాలని ఆంక్షలు పెడితే.. ఇంక వినోదం ఎక్కడి నుంచి లభిస్తుంది ? అంత మాత్రానికి తమ ఓటీటీ యాప్ లలో ఖాతాను తీసుకోవాలని ప్రచారం చేయడం ఎందుకు ? తీసుకున్నాక సినిమాలు చూడాలంటే ఇలా డబ్బులు చెల్లించాలని అడగడం దేనికి ? అంటే సినిమా పాపులర్ అయింది కనుక ప్రేక్షకుల నుంచి ఇంకొన్ని డబ్బులను పిండి వసూలు చేయాలన్నదే భావన కదా.. కనుకనే ఓటీటీ యాప్స్ ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీని వెనుక కారణాలు ఏమున్నా.. ఇప్పుడు థియేటర్లకు వచ్చిన టిక్కెట్ ధరల పెంపు సమస్య.. రేపు ఓటీటీలకు కూడా వస్తుంది. వాటిని చూడడం కూడా ప్రేక్షకులు మానేస్తారు. దీనిపై ఓటీటీ యాప్స్ పునరాలోచన చేసుకుంటే మంచిది. లేదంటే మొదటికే మోసం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.…
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 2026 నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు బోధనా…
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…