NTR Samantha : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా బుల్లితెరపై సైతం తన హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఇక్కడ మనీతో పాటు మనసుల్ని కూడా గెలుచుకోవచ్చు.. లాంటి ప్రోగ్రామ్ తో మరింత సక్సెస్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ ప్రోగ్రామ్ కి సమంత గెస్ట్ గా రానుంది. నవరాత్రి స్పెషల్ ప్రోమోగా విడుదలైన ఈ షార్ట్ అండ్ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సమంత, నాగచైతన్యల డైవోర్స్ తర్వాత స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేయబోతోంది.
ఈ ప్రోమోలో ఎన్టీఆర్.. సమంతను ఆహ్వానించారు. కూర్చుంటేనే భయంగా ఉందంటూ సామ్ ఎక్స్ ప్రెషన్స్ అద్బుతంగా ఉన్నాయి. ఏది ఏమైనా సామ్ లో ఇంతకు ముందు కనిపించిన జోష్, యాక్టివ్ నెస్ అస్సలు లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా అందరూ వెయ్యి నుండి కోటి రూపాయలకు వెళ్తుంటే.. నువ్వు మాత్రం కోటి నుండి వెయ్యికి వచ్చావని అన్నారు. దీంతో సమంత.. అయితే నాకు డబ్బులు వద్దు అంటుంది.. వద్దా అని ఎన్టీఆర్ అడగ్గా మళ్ళీ కావాలని అడుగుతుంది. ఫైనల్ గా తన అభిమానుల కోసం బుల్లితెరపై నవరాత్రుల్లో దసరా కానుకగా సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించేశారు.
ఇక సమంత విడాకుల నేపథ్యంలో ఆమె తన సోషల్ మీడియోలో చేసే పోస్టులపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సామ్ దే తప్పంటుంటే మరికొంతమంది విడాకులనేది వారి పర్సనల్ విషయాలని ఆమెకు మద్దతు తెలిపారు. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతారలతో పాటుగా కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. మరికొన్ని సినిమా ప్రాజెక్ట్స్ తో తన కెరీర్ ని ముందుకు సాగించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇక తన విడాకుల క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా స్పందించడంతో చాలా వరకు ఈ వివాదం సైలెంట్ అయ్యింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…