Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసిన అనంతరం అందులో ఈమె వరుసగా పోస్టులు పెడుతోంది. ఈ మధ్యే భర్త చైతన్యతో కలిసి జోర్డాన్కు వెళ్లి వచ్చిన ఈమె అక్కడ పలు ప్రాంతాల్లో విహరించింది. ఎర్రని ఎండలో ఎరుపు రంగు దుస్తులను ధరించి ఈమె ఫొటోలకు పోజులు ఇచ్చింది. తరువాత ఓ చోట బహిరంగంగానే తన భర్తకు లిప్లాక్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి ఫొటోలను ప్రయివేట్గా దాచుకోవాలి కానీ.. పబ్లిగ్గా షేర్ చేస్తారా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకో ఫొటోను షేర్ చేసింది. అయితే ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె నెటిజన్లను ఓ ప్రశ్న కూడా అడిగింది.
నిహారిక తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి దాంతోపాటు ఓ ప్రశ్న అడిగింది. ఆ ఫొటోలో ఉన్న నీడల ఆధారంగా టైమ్ ఎంత అవుతుందో చెప్పగలరా ? అంటూ ఆమె ప్రశ్న వేసింది. అయితే ఇందుకు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెబుతుండగా.. కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.
ఆమె అడిగినట్లుగా టైమ్ ఉదయం 10-11 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఉంటుందని కొందరు బదులిచ్చారు. ఇక ఈ ఫొటోలో అద్భుతంగా ఉన్నావని ఇంకొందరు కామెంట్లు చేశారు. నీకు పనీ పాట ఏమీ లేదా.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా నిహారిక ఈ మధ్యే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం విదితమే. తరువాత బెయిల్పై బయటకు వచ్చింది. అయితే నాగబాబు, ఆయన భార్య మాత్రం తమ కూతురికి ఏమీ తెలియదని అన్నారు. దీంతో నెటిజన్లు నాగబాబును ట్రోల్ చేశారు. నీ కుమార్తెకు ఏమీ తెలియకపోతే అర్థరాత్రి పూట తెలుగు సంవత్సరం రోజు భర్త లేకుండా ఒక పబ్లో ఏం చేస్తుంది.. ఉగాది పచ్చడి తినేందుకు వెళ్లిందా.. అంటూ నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇందుకు మాత్రం ఆయన బదులు చెప్పలేదు. ఇక నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ చానల్లో ట్రావెల్ షోను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…