Adah Sharma : సినిమా ఆఫర్లు లేని చాలా మంది హీరోయిన్లు ప్రస్తుతం సోషల్ మీడియాపై పడ్డారు. అందులో తమ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తున్నారు. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామర్ పేరిట అడ్డమైన డ్రెస్లను ధరిస్తున్నారు. అలాంటి వారిలో అదాశర్మ ముందుంటుందని చెప్పవచ్చు. ఈమె అప్పుడప్పుడూ ధరించే డ్రెస్లు వివాదాస్పదం అవుతుంటాయి. గతంలో ఈమె రన్నింగ్ కారు పక్కన డ్యాన్స్ చేసి అభాసుపాలైంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈమెకు క్లాస్ పీకారు. అయినప్పటికీ ఈమె తన పని తాను చేసుకుపోతుంది. కానీ అలా చేయడం మానడం లేదు.
ఇక తాజాగా అదాశర్మ లేత ఆకుపచ్చ, పసుపు రంగులో ఉన్న డ్రెస్ను ధరించింది. ఆ డ్రెస్ అదో మాదిరిగా ఉంది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలను ఆమె షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి. అయితే ఆమె ధరించిన డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆ డ్రెస్ ఏంటి.. ఆ అవతారం ఏంటి.. అని ఆమెను విమర్శిస్తున్నారు.
గ్లామరస్ డ్రెస్ ధరించావు సరే.. కాస్త బెటర్గా ఉండే డ్రెస్ ధరిస్తే ఏమొచ్చింది.. మరీ చండాలంగా ఉన్నావు.. అని అదాశర్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇక అదాశర్మ టాలీవుడ్కు హార్ట్ ఎటాక్ అనే మూవీ ద్వారా పరిచయం కాగా.. తరువాత కూడా పలు సినిమాల్లోనూ నటించింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు లభించింది సెకండ్ హీరోయిన్ ఆఫర్లే. అలాగే తెలుగుతోపాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. కానీ అవేవీ పెద్దగా హిట్ కాలేదు.
కాగా అదాశర్మ ప్రస్తుతం ఓ మార్షల్ ఆర్ట్స్ మూవీలో నటిస్తోంది. అందుకు గాను ఆమె విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది. ఇక ఈమెకు ఇప్పటికే కర్రసాము, కరాటే లాంటి విద్యల్లో నైపుణ్యం ఉంది. దీంతో ఈమెకు ఇది ప్లస్ పాయింట్గా మారనుంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…