Neck Darkness : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి వాతావరణంలో మార్పుల వలన చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అలాగే కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. మెడ నలుపు పోగొట్టుకోవడానికి రకరకాల క్రీమ్స్, ఇంటి చిట్కాలను ఉపయోగించి ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినట్లయితే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేయండి. మెడపై నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది.
దీనికోసం ముందుగా ఎనిమిది బాదంపప్పులను రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బాదం పప్పులపై పొట్టు తీసి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో ఒక టీ స్పూన్ మిల్క్ పౌడర్ ని కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగంపై అప్లై చేసి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
తర్వాత ఈ ప్యాక్ వేసిన భాగంలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ వేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు, నాలుగు రోజులపాటు చేసినట్లయితే మీ మెడ నలుపు మొత్తం పోయి తెల్లగా మెరిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…