Unstoppable 2 : నందమూరి నట సింహం బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై చేసిన షో.. అన్స్టాపబుల్. ఈ షో మొదటి సీజన్ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. అన్ని ఎపిసోడ్లు చాలా ఆసక్తికరంగా సాగాయి. పలువురు నటీనటులతో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆహా ప్లాట్ఫామ్ పై వచ్చిన ఈ షో ఎంతో మందిని అలరించింది. ఈ క్రమంలోనే మొదటి సీజన్ ఇచ్చిన జోష్తో రెండో సీజన్ను మొదలు పెట్టనున్నారు. అందులో భాగంగానే తాజాగా అన్స్టాపబుల్ 2 ట్రైలర్ను కూడా లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య భిన్నమైన గెటప్లో కనిపించి అదరగొట్టేశారు.
ఇక అన్స్టాపబుల్ షో మొదటి సీజన్కు గాను బాలయ్య మొత్తంగా రూ.2.50 కోట్లను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలిసింది. అయితే మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్కు బాలయ్య ఇంకా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయన అన్స్టాపబుల్ 2కు మొత్తం రూ.10 కోట్లను రెమ్యునరేషన్గా అందుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక అన్స్టాపబుల్ 2 షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా అన్స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్లో బాలయ్య తన బావ నారా చంద్రబాబు నాయుడుతో సంభాషించనున్నారు. ఈ ఎపిసోడ్ దీపావళికి ప్రసారం అవుతుందని సమాచారం. అలాగే ఈ సీజన్లో పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేష్ వంటి నటులను షోకు రప్పిస్తారని తెలుస్తోంది. దీంతో మొదటి సీజన్ కన్నా రెండో సీజన్ అన్స్టాపబుల్ షో మరింత రసవత్తరంగా సాగుతుందని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…