Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరు పలు సందర్భాల్లో ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవడమే కాక.. చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కూడా. వీరు గత 4 ఏళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో ఆలయాలు తిరిగారు. ఒక ఆలయంలో అయితే నయనతార నుదుటిపై సింధూరం పెట్టుకుని కనిపించింది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో పెళ్లయిన స్త్రీలు మాత్రమే అలా నుదుటిపై సింధూరం ధరిస్తారు. దీంతో అందరిలోనూ అనుమానాలు బలపడ్డాయి. వీరిద్దరూ ఇప్పటికే వివాహం చేసుకుని ఉంటారని.. కానీ అది బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని.. ఏదో గ్రహ దోషం ఉండడం వల్లే ఇలా చేస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే వారిద్దరికీ ఇదివరకే వివాహం అయిందన్న విషయం అబద్ధమని తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు మరి.
నయనతార, విగ్నేష్ శివన్లు తమ ప్రేమ బంధానికి స్వస్తి చెప్పి త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవనున్నారని తెలుస్తోంది. వీరు జూన్ 9న పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఓ తమిళ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. వీరు ఆ తేదీన తిరుమలలో వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. కేవలం కొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల నడుమ వీరి వివాహం జరగనుందని సమాచారం. అయితే వివాహం అయ్యాక రిసెప్షన్ను మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఏకంగా మాల్దీవ్స్లో వీరు తమ రిసెప్షన్ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దానికి ఆయా భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులకు వీరు ఆహ్వానాలు పంపించనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే నయనతార, విగ్నేష్ శివన్ల పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ ఇద్దరూ గతంలో అనేక ఆలయాలకు తిరిగారు. అనేక సార్లు పూజలు చేశారు. నయనతార జాతకంలో దోషం ఉందని.. కనుకనే ఇన్ని రోజులపాటు పూజలు చేసినట్లు తెలుస్తోంది. కాబట్టే ఇప్పటి వరకు వారు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని.. ఇక సరైన సమయం వచ్చింది కనుకనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎట్టకేలకు ఈ జంట ఒక్కటి కానుంది. అయితే ప్రస్తుతానికి ఇది వైరల్ అవుతున్న సమాచారమే. దీనిపై వారు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఏమైనా చెబుతారో.. లేదో.. చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…
సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు…
ఆధార్కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.…