Nayanthara : కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ కొన్నాళ్లుగా తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. నయన్.. శింబు, ప్రభుదేవాలకి బ్రేకప్ చెప్పాక విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. ఇక అప్పటి నుండి అతనితోనే సన్నిహితంగా ఉంటూ తెగ చక్కర్లు కొడుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే నయనతార పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ జంట సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా విగ్నేష్ శివన్, నయనతార జంట మైలాపూర్ లోని శ్రీ సాయిరాం టెంపుల్ ని సందర్శించారు. దీంతో గుడి వద్ద జనసందోహంగా మారింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ చేతిలో పూల మాలలతో కనిపించారు. దీనితో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ఇద్దరూ కలిసి కట్టుగా పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు వెళుతున్నారు. వీరిద్దరూ బయట కనిపిస్తే చాలు.. అభిమానులకి ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా నయనతార తన జాతకం ప్రకారం పలు ఆలయాల్లో పూజలు చేయించుకుంటోందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పూజలన్నీ పూర్తయ్యాక విగ్నేష్ శివన్, నయన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నయనతార.. విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే కణ్మణి రాంబో ఖతీజా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అతి త్వరలో విడుదల కానున్న ఈ సినిమా రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెట్లో సమంత చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…