Nagarjuna : టాలీవుడ్ క్యూట్ కపుల్గా ఉన్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఎంతో మందిని షాక్కు గురి చేసింది. అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సంగతి అలా ఉంచితే కొన్ని యూట్యూబ్ చానల్స్, వెబ్సైట్లు ఈ విషయంలో కాస్త హద్దు మీరి ప్రవర్తించినట్లు అర్థమైంది. ఈ క్రమంలోనే సమంత వారిపై కోర్టు వరకు వెళ్లి క్షమాపణలు చెప్పేలా చేసింది.
అయితే నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై నాగార్జున ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించారు. నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై ఆయన తొలిసారిగా మాట్లాడారు.
కావాలనే కొందరు పనిగట్టుకొని చెత్త రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ను నేను పట్టించుకోను.. అని నాగార్జున అన్నారు.
అయితే సమంత, చైతన్య ఇద్దరూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించగానే అనేక పుకార్లు షికార్లు చేశాయి. సమంతకు పిల్లలను కనడం నచ్చ లేదని, ఆమె స్కిన్ షోకు అక్కినేని ఫ్యామిలీ అభ్యంతరం చెబుతుందని, ఆమె అబార్షన్ చేయించుకుందని.. రకరకాల వార్తలను ప్రచారం చేశారు. వాటన్నింటికీ సమంత చెక్ పెట్టేసింది. అయినప్పటికీ సమంతను ఇప్పటికీ కొందరు నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు.
కాగా నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. ఈ మూవీలో చైతూ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించి మెప్పించింది. త్వరలో చైతన్య లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీలో కనిపించనున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం, కాతువాకుల రెండు కాదల్ అనే మూవీల్లో కనిపించనుంది. ఇటీవలే ఆమె పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. అలాగే త్వరలో లైగర్ మూవీలోనూ సామ్ ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…