Nagarjuna : టాలీవుడ్ క్యూట్ కపుల్గా ఉన్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఎంతో మందిని షాక్కు గురి చేసింది. అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సంగతి అలా ఉంచితే కొన్ని యూట్యూబ్ చానల్స్, వెబ్సైట్లు ఈ విషయంలో కాస్త హద్దు మీరి ప్రవర్తించినట్లు అర్థమైంది. ఈ క్రమంలోనే సమంత వారిపై కోర్టు వరకు వెళ్లి క్షమాపణలు చెప్పేలా చేసింది.
అయితే నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై నాగార్జున ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించారు. నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై ఆయన తొలిసారిగా మాట్లాడారు.
కావాలనే కొందరు పనిగట్టుకొని చెత్త రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్ను నేను పట్టించుకోను.. అని నాగార్జున అన్నారు.
అయితే సమంత, చైతన్య ఇద్దరూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించగానే అనేక పుకార్లు షికార్లు చేశాయి. సమంతకు పిల్లలను కనడం నచ్చ లేదని, ఆమె స్కిన్ షోకు అక్కినేని ఫ్యామిలీ అభ్యంతరం చెబుతుందని, ఆమె అబార్షన్ చేయించుకుందని.. రకరకాల వార్తలను ప్రచారం చేశారు. వాటన్నింటికీ సమంత చెక్ పెట్టేసింది. అయినప్పటికీ సమంతను ఇప్పటికీ కొందరు నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు.
కాగా నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది. ఈ మూవీలో చైతూ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించి మెప్పించింది. త్వరలో చైతన్య లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీలో కనిపించనున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం, కాతువాకుల రెండు కాదల్ అనే మూవీల్లో కనిపించనుంది. ఇటీవలే ఆమె పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. అలాగే త్వరలో లైగర్ మూవీలోనూ సామ్ ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…