Munugode Bypoll : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం విదితమే. అయితే ఆ అసెంబ్లీ సీటుకు గాను ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. మునుగోడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటనను విడుదల చేసింది.
నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనుండగా.. 6వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 14 కాగా.. ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ప్రచారం మొదలు పెట్టేశారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. మద్యం, మటన్, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దావత్లు ఇస్తున్నారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గాను ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. తెరాస నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ వస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే కోమటిరెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ తేదీని చెప్పడంతో ఇక తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కనున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…