Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ ఓ సరికొత్త ఖరీదైన కారును కొనుగోలు చేశాఉ. రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన కల్లినన్ అనే మోడల్ కారును ఆయన ఏకంగా రూ.13.14 కోట్లు వెచ్చించి మరీ కొన్నారు. దీంతో దేశంలోని వీఐపీలు వాడుతున్న అత్యంత ఖరీదైన కార్లలో ఇదొకటిగా నిలిచింది.
కాగా ఈ కారు అసలు ధర రూ.6.95 కోట్లు. కానీ దీన్ని ముకేష్ అంబానీకి తగినట్లుగా మోడిఫై చేశారు. దీంతో దీని ధర రూ.13.14 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ కారును రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట జనవరి 31వ తేదీన రిజిస్టర్ చేశారు. దక్షిణ ముంబైలోని టార్డియో రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కారును రిజిస్టర్ చేశారు.
ఇది పెట్రోల్ మోడల్ కారు కాగా.. దీని బరువు సుమారుగా 2.5 టన్నుల వరకు ఉంటుంది. 564 బేసిక్ హార్స్ పవర్ను ఈ కార్ అందిస్తుంది. దీనికి గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ప్రత్యేక ఫ్యాన్సీ నంబర్ను కూడా కొనుగోలు చేశారు. అయితే అంబానీ కోరుకున్న నంబర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీవో వారు కొత్త సిరీస్ను ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో 0001 అనే నంబర్కు గాను రూ.12 లక్షలు చెల్లించి మరీ రిజిస్టర్ చేశారు.
కాగా రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కింద రూ.40వేలను చెల్లించారు. అయితే ఇప్పటికే అంబానీ గ్యారేజ్లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆయన కోసం ప్రత్యేకంగా ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన సెక్యూరిటీ కోసం నియమించిన సిబ్బందికి గాను ప్రత్యేకంగా రూపొందించిన మోడిఫైడ్ బీఎండబ్ల్యూ కారును ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…