Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో నటించిన మూవీ.. ఆచార్య. ఈ సినిమా శుక్రవారం ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, పోస్టర్స్కు విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. దీంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడ్డ ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ఏ మూవీ వచ్చినా నెగెటివ్ టాక్ను వ్యాపింపజేసే కొందరు ఈసారి కూడా ఆచార్యపై అలాంటి ప్రచారమే చేస్తున్నారు.
సాధారణంగా చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్.. మూవీలు ఏవైనా సరే మొదటి వారం రోజులు థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. సీట్లు అసలు దొరకవు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆచార్య సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయని.. బుక్ మై షో యాప్లో చూస్తే మొత్తం గ్రీన్ కలర్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుందని.. విమర్శిస్తున్నారు. అలాగే ఇదే విషయంపై ట్రోల్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
అయితే యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని మెగా అభిమానులు బాగానే తిప్పి కొడుతున్నారు. కొందరు కావాలనే ఈ మూవీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని, థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే అటు యాంటీ ఫ్యాన్స్కు, ఇటు ఫ్యాన్స్కు మధ్య మీమ్స్, ట్రోల్స్ యుద్ధం జరుగుతోంది. అయితే వాస్తవానికి మెగాస్టార్ సినిమా అంటేనే కచ్చితంగా థియేటర్స్ ఫుల్ అవుతాయి. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు కావాలనే పనిగట్టుకుని ఇలా మెగా ఫ్యామిలీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కించగా.. పూజా హెగ్డె రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా నటించింది. స్టాలిన్ మూవీ తరువాత చాలా సంవత్సరాలకు మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించడం విశేషం.
భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…
మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ పవన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…