Meenakshi Seshadri : సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా ఏళ్ల పాటు కెరీర్ను కొనసాగిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. కొన్నేళ్ల పాటు మాత్రమే వారి కెరీర్ ఉంటుంది. తరువాత పెళ్లి చేసుకుని స్థిర పడుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొందరు పెళ్లి అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి శేషాద్రి ఒకరు. ఈమె అప్పట్లో టాప్ హీరోయిన్గా ఉండేది. కానీ వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయింది.
మీనాక్షి శేషాద్రి పేరు చెప్పగానే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆపద్బాంధవుడు సినిమానే మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈమె ఇదే కాదు.. ఇంకా అనేక చిత్రాల్లో నటించింది. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధి అనే ప్రాంతంలో జన్మించింది. వీరి కుటుంబం మొత్తం తమిళ నేపథ్యం ఉన్నవారే. ఇక మీనాక్షి శేషాద్రి మంచి నృత్యకారిణి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ లాంటి నృత్యాల్లో ఈమెకు ప్రావీణ్యత ఉంది. అప్పట్లో ఆమె మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది.
మీనాక్షి శేషాద్రి అప్పట్లో టాప్ మోడల్గా కూడా ఉంది. ఈమె అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ఎన్టీఆర్, బాలయ్య కలసి నటించిన విశ్వామిత్ర అనే మూవీలో మేనక పాత్రను పోషించింది. 1980-90లలో ఈమె భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇప్పుడు 57 ఏళ్లకు పైగానే ఉంటాయి. దీంతో ముఖంలో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈమెను సులభంగానే గుర్తు పట్టవచ్చు. ఇక ఈమె ప్రస్తుతం అమెరికాలో సెటిల్ కాగా.. అక్కడే చాలా మందికి నాట్యం నేర్పిస్తోంది. కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…