Meenakshi Seshadri : సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా ఏళ్ల పాటు కెరీర్ను కొనసాగిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. కొన్నేళ్ల పాటు మాత్రమే వారి కెరీర్ ఉంటుంది. తరువాత పెళ్లి చేసుకుని స్థిర పడుతుంటారు. అయితే ఇలాంటి వారిలో కొందరు పెళ్లి అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మీనాక్షి శేషాద్రి ఒకరు. ఈమె అప్పట్లో టాప్ హీరోయిన్గా ఉండేది. కానీ వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె వివాహం చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయింది.
మీనాక్షి శేషాద్రి పేరు చెప్పగానే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆపద్బాంధవుడు సినిమానే మనకు గుర్తుకు వస్తుంది. అయితే ఈమె ఇదే కాదు.. ఇంకా అనేక చిత్రాల్లో నటించింది. ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధి అనే ప్రాంతంలో జన్మించింది. వీరి కుటుంబం మొత్తం తమిళ నేపథ్యం ఉన్నవారే. ఇక మీనాక్షి శేషాద్రి మంచి నృత్యకారిణి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ లాంటి నృత్యాల్లో ఈమెకు ప్రావీణ్యత ఉంది. అప్పట్లో ఆమె మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది.
మీనాక్షి శేషాద్రి అప్పట్లో టాప్ మోడల్గా కూడా ఉంది. ఈమె అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ఎన్టీఆర్, బాలయ్య కలసి నటించిన విశ్వామిత్ర అనే మూవీలో మేనక పాత్రను పోషించింది. 1980-90లలో ఈమె భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇప్పుడు 57 ఏళ్లకు పైగానే ఉంటాయి. దీంతో ముఖంలో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈమెను సులభంగానే గుర్తు పట్టవచ్చు. ఇక ఈమె ప్రస్తుతం అమెరికాలో సెటిల్ కాగా.. అక్కడే చాలా మందికి నాట్యం నేర్పిస్తోంది. కానీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉంటోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…