Meena Husband : తెలుగు ప్రేక్షకులకు మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ఈమె నటించింది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు అందరితోనూ ఈమె యాక్ట్ చేసింది. అయితే వివాహం కారణంగా కొంత కాలం పాటు ఈమె సినిమాలకు దూరంగా ఉంది. తరువాత కుమార్తె నైనిక జన్మించిన అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోన ఈమె అదరగొడుతోంది. అనేక చిత్రాల్లో ఈమె నటించగా.. అవి హిట్ అయ్యాయి.
అయితే మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. అయితే జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా.. అందరూ కోలుకున్నారు. కానీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. దీంతోనే ఆయన చనిపోయారు. కానీ ఆయన మరణం పట్ల సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. మీనాకు, ఆమె భర్త విద్యాసాగర్కు మధ్య మనస్ఫర్థలు వచ్చాయని.. క్షణికావేశంలో పరస్పరం అరుచుకున్నారని.. దీంతో మనస్థాపం చెందిన విద్యాసాగర్ కు ఆరోగ్యం క్షీణించిందని.. అందువల్లే ఆయన చనిపోయారని.. వార్తలు వచ్చాయి.
అయితే మీనా ఈ వార్తలపై స్పందిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని.. తాను ఎంతో ప్రేమించే వ్యక్తి దూరం అయ్యాడని.. కనుక తమకు ఇప్పుడు ప్రైవసీ కావాలని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులో కోరింది. అయితే విద్యాసాగర్కు ఉన్న ఆస్తుల విలువపై ఇప్పుడు చర్చంతా నడుస్తోంది. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పటికీ మంచి టాలెంటెడ్ అని సమాచారం. అందువల్లే ఆయనకు కొన్ని కంపెనీల్లో వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులు విలువ రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఆయన చనిపోయారు కనుక ఆయన ఆస్తి మొత్తం మీనాకే దక్కనుంది. కానీ మీనా కూడా సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది. కనుక ఆమెకు కూడా బాగానే ఆస్తులు ఉంటాయని సమాచారం. ఇక ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…