Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటూ స్టార్ హీరోగా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోను హీరోనే. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని ఈ స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా జరిగే సేవా కార్యక్రమాల గురించి నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఏప్రిల్ 7న నమ్రత ఓ పోస్ట్ చేశారు. అందులో 30 మంది చిన్నారులకు ఒకే రోజు ఆపరేషన్ చేసినట్టుగా తెలిపారు. అంటే ఒకే రోజు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 30 మంది చిన్నారులకు ఊపిరి అందిందన్నమాట. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ వైద్యుల సహకారంతో చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు.
మంచి పనికి సపోర్ట్ ను అందించినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్కు ధన్యవాదాలు తెలిపారు నమ్రత. ఒకవైపు చిన్నారుల జీవితాలలో వెలుగు నింపుతున్న మహేష్ మరో వైపు తన సొంతూరు బుర్రిపాలెంలోనూ డిజిటల్ లెర్నింగ్ను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రారంభించారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మహేష్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…