Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రముఖుల బర్త్ డేలకి శుభాకాంక్షలు అందించడమే కాకుండా, చిన్న, పెద్ద సినిమాలకు రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా అందరి కన్నా ముందే మహేష్ తన స్పందన తెలియజేస్తూ వస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 విషయంలో మహేష్ ఇప్పటి వరకు స్పందించలేదు. కేజీఎఫ్ 2 పై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మహేష్కి నచ్చకపోవడంతోనే ఆయన ట్వీట్ చేయలేదని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరికొంతమంది మాత్రం సర్కారు వారి పాటతో బిజీగా ఉండడంతో చూసే అవకాశం రాలేదని అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్, పుష్పతోపాటు పలు చిత్రాల గురించి మహేష్ ట్వీట్ చేశారు. కేజీఎఫ్2 విషయంలో ఆయన మౌనం గాసిప్ రాయుళ్లు మాట్లాడుకునేలా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కేజీఎఫ్ 2 చిత్రాన్ని మెచ్చుకోగా, మహేష్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి . మరి ఇప్పటికైనా మహేష్ స్పందిస్తారా.. అనేది చూడాలి.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాను రూపొందించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేస్తోంది. హిందీ వెర్షన్ లో ఈ సినిమా రూ.250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే రూ.300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఫుల్లుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…