Mahaan Movie : ఇటీవల ఒక నెల రోజుల కిందటి వరకు అంతా బాగానే ఉంది. కరోనా కేసులు తగ్గాయి, ఇక థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. అనేక సినిమాలు థియేటర్లలోనే విడుదలయ్యాయి. కానీ నెల తిరిగే సరికి పరిస్థితి అంతా తారుమారైంది. కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నిర్మాతలు మళ్లీ థియేటర్లను వదిలి ఓటీటీల బాట పడుతున్నారు. ఇక తాజాగా తమిళ నటుడు విక్రమ్ కూడా ఓటీటీలోనే తన సినిమాను విడుదల చేయబోతున్నారు.
విక్రమ్ నటించిన మహాన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన అమెజాన్లో రిలీజ్ చేయనున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్ర విడుదలపై అనేక వార్తలు వచ్చాయి. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది.
ఇక ఈ మూవీలో విక్రమ్తోపాటు ఆయన తనయుడు ధ్రువ్ కూడా కీలక పాత్రలో నటించాడు. అర్జున్ రెడ్డి రీమేక్తో ధ్రువ్ హీరోగా పరిచయం అయ్యాడు. రెండో సినిమాకే తన తండ్రితో కలిసి చేయడం విశేషం. పిజ్జా, జిగర్ తండా సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మహాన్కు దర్శకత్వం వహించారు. కార్తీక్ చివరి సినిమా జగమే తంత్రం ఓటీటీలోనే నేరుగా రిలీజైంది.
గతలో కార్తీక్ అద్భుతమైన సినిమాలు తీసినా.. పేట నుంచి ఫ్లాప్ అవుతున్నాడు. అయితే మహాన్తో అయినా అదృష్టం మళ్లీ వరిస్తుందో, లేదో చూడాలి. ఈ మూవీలో బాబీ సింహా, సిమ్రాన్లు కీలక పాత్రల్లో నటించారు.
చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం(చెపాక్)లో విజిల్లపై నిషేధం అమలులోకి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లతో ఈ నిర్ణయం అమలవుతోంది.…
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్తో కలిసి చేసిన ఓ సరదా…
ప్రభుత్వ బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త రిక్రూట్మెంట్…
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు…
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…